26/01/2020
గురజాడ విద్యా సంస్థల లో గణతంత్రదినోత్సవ వేడుకలు
26.01.2020 ఆదివారం మునసబుపేట గురజాడ విద్యా సంస్థల లో గణతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థల అధినేత జి వి స్వామి నాయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేసారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేసించి మాట్లాడుతూ గురజాడ విద్యా సంస్థలు పర్యావరణ పరిరక్షణపై దృష్ఠి సారించాలని పిలుపు నిచ్చారు.
ఈ సందర్భంగా ఎన్ సి సి కెడెట్ల పెరేడ్ వీచకులను ఆకర్షించింది.. తదుపరి అంతర ఎన్ సి సి ట్రూప్ పోటీలలో గెలుపొందిన ఎన్ సి సి కేడెట్ల కు స్వామి నాయుడు పతకాలు బహూకరించారు ఈ కార్యక్రమం లో
గురజాడ విద్యాసంస్థల సంచాలకులు సంయుక్త, కారస్పొండెంట్ అంబటి రంగారావు, గాయత్రి కళాశాల ప్రిన్సిపాల్ పులఖండం శ్రీనివాస రావు, గాయత్రి స్కూల్ ప్రిన్సిపాల్ ఎ కే విజయ లక్ష్మీ, వైస్ ప్రిన్సిపాల్ ఎన్ సి సి అధికారి హెచ్ ఒ డి కెప్టెన్ వి మహేష్, హెచ్ ఒ డిలు కే వి వి సత్యనారాయణ, హెచ్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు