Bhimavaram News

Bhimavaram News Daily Updated Local & Regional news in and around Bhimavaram. Stay Tuned..!

11/09/2024
ఇళ్ళ నిర్మాణకార్యక్రమం వెంటనే చేపట్టాలి  నరసాపురం.జూన్.16,2021నిరుపేదలు ఇల్లు నిర్మాణాలు  పక్కా ప్రణాళికతో  పూర్తి చెయ్య...
16/06/2021

ఇళ్ళ నిర్మాణకార్యక్రమం వెంటనే చేపట్టాలి

నరసాపురం.జూన్.16,2021

నిరుపేదలు ఇల్లు నిర్మాణాలు పక్కా ప్రణాళికతో పూర్తి చెయ్యాలి : ఆర్.డి.వో శ్రీమతి పి.పద్మావతి.

గృహ నిర్మాణాలు సంబంధించి లేఅవుట్ ల వారీగా డి పి ఆర్ లు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని , లబ్ధి దారులుతో శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తి చేసి ఇండ్ల నిర్మాణాలు పనులు వేగవంతం చేయాలని ఆర్.డి. వో శ్రీమతి పి.పద్మావతి అధికారులకు ఆదేశించారు.ఆచంట మండలం కొడమంచిలి గ్రామంలో రైతు కమ్యూనిటీ హాలులో బుధవారం వివిధ శాఖలు అధికారులతో అర్.డి. వో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.డి.వో మాట్లాడుతూ అన్ని లేఅవుట్ లకు సంబంధించి డి పీఆర్ లు రూపొందించి వాటిని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని,అన్ని లేఅవుట్ లలో వాటర్ సప్లై , విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని అమె అన్నారు.లేఅవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని గృహాలు గ్రౌండింగ్ వేగవంతం చేయాలని అధికాలకు ఆమె తెలిపారు . లే అవుట్ పూర్తి అయిన స్థలాలలో త్వరితాగతిన లబ్దిదారులతో మాట్లాడి గృహాలు నిర్మించడానికి అంగీకరించేలా ఒప్పించాలని, స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా భాగస్వాములను చేయాలని ఆమె తెలిపారు. ప్రతి లే ఔట్ లో మోడల్ హౌస్ ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని , గృహ నిర్మాణాలకు సంబంధించి మెటీరియల్ ప్రోక్యూర్మెంట్ త్వరితగతిన చేయాలనీ, ప్రతీ లే అవుట్ కు ఒక ఇంచార్జి అధికారిని, క్లస్టర్ ఇంచార్జి అధికారులను నియమించడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రానికల్లా ప్రతి లే అవుట్ గృహ నిర్మాణాలు ప్రగతిని జిల్లా , డివిజన్ అధికాలకు నివేదికలు ఇవ్వాలని ఆమె తెలిపారు. డివిజన్ లలోని స్వంత స్థలలో గృహలు నిర్మాణాలు, లేఅవుట్ లలో గృనిర్మాణాలను ఎప్పటికప్పుడు ప్రత్రేక అధికారి ,రెవిన్యూ బృందంతో మేము పరిశీలన చేస్తామని, హౌసింగ్ నిర్మాణా పనులలో ప్రగతి ఏక్కడయినా వెనుకబడి ఉన్నా సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని ఆర్.డి.వో శ్రీమతి పి.పద్మావతి స్పస్టం చేశారు.

ఈ సమావేశంలో ప్రత్యేక అధికారి వెంకట రావు, తశిల్డార్ ఏ.మధుసూదన రావు ,యం.పి.డి. వో యన్.శ్రీనివాస రావు ,గ్రామ సర్పంచ్ సుంకర.సీతారామ్,లబ్ధి దారులు ,వివిధ శాఖలు అధికారులు పాల్గొన్నారు.

ధరలు అదుపు చేయలేకున్న ప్రభుత్వం భీమవరం,09 జూన్ 2021 రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలను తక్షణం...
09/06/2021

ధరలు అదుపు చేయలేకున్న ప్రభుత్వం

భీమవరం,09 జూన్ 2021

రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలను తక్షణం తగ్గించాలని సిపిఎం డెల్టా జిల్లా కార్యదర్శి బి. బలరాం డిమాండ్ చేసారు. స్థానిక మెంటేవారితోట పుచ్చలపల్లి సుందరయ్య భవనం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా బలరాం మాట్లాడుతూ ఒక ప్రజలు కరోనాతో పోరాడుతుంటే, ప్రభుత్వాలు ప్రజలపై పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్, నిత్యావసరాల ధరల పేరుతో ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వీటిని ఏమాత్రం మియంత్రించడం లేదన్నారు. కార్పొరేట్లు, బడా కంపెనీలు వారికి ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇస్తున్నారని ఆగ్రహించారు. ఈరోజు ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు రేపటికి అలానే ఉంటాయనే నమ్మకం లేదన్నారు. అలా పెరుగుతూ నేడు లీటర్ పెట్రోల్ రూ.102.05, డీజిల్ రూ.96.36 చేరుకున్నాయని అన్నారు. వీటిలో సగానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసే పన్నులే ఉన్నాయని అన్నారు. ఈ పన్నులను ప్రభుత్వాలు తగ్గించుకుంటే తక్కువ ధరలకే ప్రజలకు వీటిని ఇవ్వొచ్చన్నారు. ఒక వైపు అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గినా, మన దేశంలో మాత్రం ధరలు విపరీతంగా పెరగడం దారుణమన్నారు. ప్రజలు ప్రశ్నించకపోతే ఈ ధరలు మరింత పెరిగే ప్రమాదముందన్నారు. పప్పులు, వంట నూనె, గ్యాస్, నిత్యావసరాల ధరలు నిత్యం ఆకాశాన్ని తాకుతూ ప్రజలపై మరింత భారాన్ని పెంచుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న భారాలను తగ్గించి, ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్ల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె ఎన్ వి గోపాలన్, నాయకులు అల్లూరి అరుణ్, ఎం. ఆంజనేయులు, ఇంజేటి శ్రీనివాస్, జి. రఫాయేలు పాల్గొన్నారు.

08/06/2021

పోలవరం ప్రాజెక్టు లో పులస చేపకు వల

నరసాపురం ఆర్డీఓ గా పద్మావతి నరసాపురం.జూన్,08,2021.నరసాపురం డివిజన్ 62వ రెవిన్యూ డివిజన్ అధికారిగా శ్రీమతి పి.పద్మావతి పద...
08/06/2021

నరసాపురం ఆర్డీఓ గా పద్మావతి
నరసాపురం.జూన్,08,2021.
నరసాపురం డివిజన్ 62వ రెవిన్యూ డివిజన్ అధికారిగా శ్రీమతి పి.పద్మావతి పదవీ బాధ్యతలు చేపట్టారు.
నరసాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి ఇంఛార్జి పూర్తి అదనపు భాద్యతలు తో మంగళ వారం జాయిన్ అయ్యారు.ఈమె పశ్చిమ గోదావరి జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారిగా పని చేయ్యు చున్నారు.ఇప్పటి వరకు పనిచేసిన శ్రీ కె.యస్.విశ్వనాధన్ ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా పదోన్నతి పై వెళ్ళిన విషయం తెలిసినదే.

భీమవరంలో ' చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ' ప్రారంభం              ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ను ప్...
05/06/2021

భీమవరంలో ' చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ' ప్రారంభం

ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ను ప్రముఖ వ్యాపారవేత్త సూర్యమిత్ర ఎక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత, జనసేన పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ యిర్రింకి సూర్యారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యారావు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ కి 5లక్షల రూపాయల విరాళం ఇచ్చారు.
భీమవరం కేజీఅర్ఎల్ కళాశాల రోడ్డులోని సూర్యమిత్ర కార్యాలయంలో ఈ ఆక్షిజన్ బ్యాంక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ నేడు కరోనా తో ఎంతోమంది మృతి చెందుతున్నారని, అటువంటి పరిస్థితి ఎక్కడా చోటు చేసుకోకూడదనే దృడ సంకల్పంతో చిరంజీవి రెండు రాష్ట్రాల్లో చిరంజీవి చారి ట్రబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. మన జిల్లాలో రెండు చోట్ల ఈ ఆక్సిజన్ బ్యాంక్ ను ప్రారంభించామని అన్నారు. మెగా ఫ్యాన్స్ నాయకులు, చిరుపవన్ తేజం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు, బండి రమేష్ కుమార్ మాట్లాడుతూ కరోనా తో ఇబ్బందులు పడుతూ ఆక్సిజన్ అవసరమైన వారు ఈ బ్యాంక్ లో సంప్రదించిన మరొక క్షణమే అందిస్తామని అన్నారు. ఆక్సిజన్ కోసం 98482 33477, 99661 77977, 92466 51222, 96760 68986 లకు సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, చల్లా రాము, కే వరం, అడబల దుర్గారావు, రావూరి ప్రభాకర్, తోట శేషు, యర్రంశెట్టి శ్రీను, శేషాద్రి హరి, రంగబాబు, కొప్పర్తి కోటి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయం మరియు గ్రామీణాభివ్రుద్ది అనే అంశం పై డాక్టర్ కలాం ఇన్నోవేషన్ ఫెస్టివల్ ని ఈనెల 27,28 వ తేదీలలో భీమవరం డాక్టర్ బ...
26/02/2020

వ్యవసాయం మరియు గ్రామీణాభివ్రుద్ది అనే అంశం పై డాక్టర్ కలాం ఇన్నోవేషన్ ఫెస్టివల్ ని ఈనెల 27,28 వ తేదీలలో భీమవరం డాక్టర్ బివి రాజు కళాశాలలలో నిర్వహిస్తున్నారు .నిర్వహిస్తున్నారు. వివరాలను సంస్థ చైర్మన్ మరియు సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ వివరాలను బుధవారం భీమవరం లో విలేకరులు తెలిపారు. భారతీయులలో స్రుజనాత్మక శక్తి ఉందని అయితే వారికి సరైన ప్రోత్సాహం లభించడం లేదన్నారు. అటువంటి వారిని అభినందించడంతో పాటు తగు ప్రోత్సాహం ఇచ్చే విధంగా క్రుషి చేస్తామన్నారు.
ఈ ఫెస్టివల్ కి మూడు రాష్ట్రాల నుంచి 83 మంది ఔత్సాహికులు వస్తున్నారని అన్నారు.
భీమవరం లో అనేక మంది ప్రముఖులకు జన్మనిచ్చిందని అందుకే ఫెస్టివల్ ఇక్కడ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమం లో పద్మశ్రీ ఆవార్డు గ్రహీత లు ఇతర ప్రముఖులు హాజరవుతారని వివరించారు.

భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ లో జి. ఎస్. టి పై అవగాహన సదస్సు. పాల్గొన్న సి. ఎ ఎఫ్. ఫల్గుణ కుమార్, చాంబర్ అధ్యక్షులు మానేపల్...
17/06/2017

భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ లో జి. ఎస్. టి పై అవగాహన సదస్సు. పాల్గొన్న సి. ఎ ఎఫ్. ఫల్గుణ కుమార్, చాంబర్ అధ్యక్షులు మానేపల్లి సూర్య నారాయణ గుప్త తదితరులు

బి. వి రాజు కళాశాల, శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ముస్లిం లకు ఇఫ్తార్ ఇచ్చిన ద్రుశ్యం
15/06/2017

బి. వి రాజు కళాశాల, శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ముస్లిం లకు ఇఫ్తార్ ఇచ్చిన ద్రుశ్యం

శ్రీ మావుళ్ళమ్మ వారి జాతర మహోత్సవం గురువారం భీమవరం ఎంఎల్ఎ పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. నీరుల్లి, కూరగాయ,పండ్ల వర...
15/06/2017

శ్రీ మావుళ్ళమ్మ వారి జాతర మహోత్సవం గురువారం భీమవరం ఎంఎల్ఎ పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. నీరుల్లి, కూరగాయ,పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది.

Address

Gunupudi
Bhimavaram
534201

Alerts

Be the first to know and let us send you an email when Bhimavaram News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share