17/05/2026
ధర్మవరం-నాందేడ్ వీక్లీ రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించిన ఎం.పీ బీ.కే పార్థసారథి_
గత కొన్ని నెలలుగా ధర్మవరం-నాందేడ్ వీక్లీ స్పెషల్ ఎక్స్ ప్రెస్ గా నడుస్తున్న ట్రైన్ పాత నెంబర్ (07190-07189)
కొత్త ట్రైన్ నెంబర్ (17636-17635) రైలును ఈరోజు నుండి రెగ్యులర్ వీక్లీ రైలుగా మార్చడం జరిగిందని. ప్రతి ఆదివారం ఉదయం 5:25 గంటలకు ధర్మవరం రైల్వే స్టేషన్ లో బయలుదేరి సోమవారం ఉదయం 8:00 గంటలకు నాందేడ్ కు చేరుతుందని,తిరుగు ప్రయాణంలో శుక్రవారం సాయంత్రం 4:45 గంటలకు నాందేడ్ లో బయలుదేరి శనివారం సాయంత్రం 7:30 గంటలకు ధర్మవరం స్టేషన్ కు చేరుకుంటుందని ఎంపీ బీ.కె పార్థసారథి తెలియజేశారు.ఈ సందర్భంగా ఉదయం 5:30 గంటలకు ధర్మవరం రైల్వే స్టేషన్ లో ధర్మవరం-నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలుకు బి.కె పార్థసారథి జెండా ఊపి రైలును ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా బి.కె పార్థసారథి మాట్లాడుతూ గతంలో స్పెషల్ ట్రైన్ గా నడుస్తున్న ధర్మవరం నాందేడ్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ రెగ్యులర్ వీక్లీ రైలుగా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి,కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారికి విజ్ఞప్తి చేయగా తక్షణమే స్పందించి స్పెషల్ ట్రైన్ గా ఉన్న ధర్మవరం నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలును వీక్లీ రెగ్యులర్ రైలుగా కొనసాగించడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు.అదేవిధంగా వీక్లీ రెగ్యులర్ రైలు నడపడం వల్ల తిరుపతి, విజయవాడ,ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, బాసర,నాందేడ్ వెళ్లే ప్రయాణికులకు పూర్తిస్థాయిలో ప్రయాణ వెసులుబాటు కలుగుతుందని ఆయన తెలియజేశారు ప్రయాణికులు పూర్తిస్థాయిలో ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.