03/11/2025
*ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP )*
ఈ పథకం క్రింద వస్తు ఉత్పత్తుల పరిశ్రమలకు రూ 50 .00 లక్షలు మరియు వ్యాపారం & సేవల సంస్థల కు రూ 20 .00 లక్షల ప్రాజెక్ట్ వ్యయం వరకు వ్యక్తుల అర్హతలను బట్టి మొత్తం ప్రాజెక్ట్ వ్యయం పై 15 % నుండి 35 % వరకు సబ్సిడీ పొందవచ్చు .MSME డాష్బోర్డ్ ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) 59,708 యూనిట్లకు సహాయం చేసి, రూ. 2,202.00 కోట్ల మార్జిన్ మనీ (MM) సబ్సిడీని పంపిణీ చేసింది. ఈ పథకం ప్రారంభమైనప్పటినుండి 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి, దేశవ్యాప్తంగా మొత్తం 10,18,185 సూక్ష్మ సంస్థలను స్థాపించడంలో PMEGP సహాయం చేసింది.ఈ సంస్థలకు, ₹73,348 కోట్ల విలువైన రుణాలు మంజూరు చేయబడ్డాయి, పథకం ప్రారంభమైనప్పటి నుండి లబ్ధిదారులకు మొత్తం ₹27,166 కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీ అందించబడింది.
3 . CETMSE స్కీం ( ఇన్సూరెన్సు క్రెడిట్ గ్యారంటీ స్కీం )
ఈ స్కీం క్రింద ప్రస్తుతం , ఉత్పత్తులతయారీ , సేవ ,వ్యాపార సంస్థల ప్రారంభానికి ,గరిష్టంగా రూ 10 .00 కోట్ల ప్రాజెక్ట్ వ్యయం వుండే వాటిని పరిగణిస్తున్నారు . మొత్తం ప్రాజెక్ట్ వ్యయం లో 5 % నుండి 25 % వరకు ( ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని బట్టి ) ప్రమోటర్లు పెట్టుబడిగా సమకూర్చుకొంటే , మిగిలిన మొత్తాన్ని కోలేటరల్ లేకుండా రుణాలు పొందే అవకాశం వున్నది . రూ 10 కోట్ల వరకు అవకాశంవున్న ప్రాజెక్ట్ నుబట్టి ,ప్రమోటర్ల అనుభవాన్ని బట్టి తగినంత మొత్తాన్ని బ్యాంకులు శాంక్షన్ చేస్తున్నాయి . నా ప్రోగ్రాంలకు హాజరైన వారు ఎందరో ఈ స్కీం క్రింద ప్రాజెక్ట్ మొదలు పెట్టామని చెప్పారు . నేను చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ల తో ఈ స్కీం ప్రకారం ప్రాజెక్టులు మొదలు పెట్టినవారు వున్నారు కూడా .
2023–24 ఆర్థిక సంవత్సరానికి, క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (CGTMSE) ₹2,02,807 కోట్ల విలువైన హామీలను వివిధ ప్రాజెక్ట్ లకు ఆమోదించింది . ఈ స్కీం మొదలైన దగ్గర నుండి అక్టోబర్ 2023 నాటికి, పథకం ప్రారంభం నుండి ఆమోదించబడిన హామీల మొత్తం విలువ ₹5 లక్షల కోట్లకు చేరుకుంది అని గణాంకాలు చెపుతున్నాయి .
-- : Mynampati Sreenivasa Rao