03/06/2026
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్
విశాఖపట్నం సమీపంలోని తగరపువలసలో జరిగిన ఓ ఈవెంట్కు హాజరైన ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ బుధవారం వేకువజామున తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సమాచారం ప్రకారం, ఆనందపురం సమీప హైవేపై పండు మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన కోళ్ల వాన్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్కు తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను సమీప ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.