31/05/2026
🏆🙌 పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పనిసరిగా గుర్తింపు వస్తుంది: వైసిపి పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి సీతం నాయుడు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి లో పార్టీ బలోపేతానికి కృషి చేసినవారికి పదవులు వాటంతట అవే వస్తాయని వైసిపి పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి మీసాల సీతం నాయుడు పేర్కొన్నారు. ఇటీవల పార్టీ ఇచ్చిన నూతన పదవులలో లావేరు ZPTC మీసాల సీతం నాయుడుకి రాష్ట్రస్థాయి కార్యదర్శి పదవి వచ్చిన సందర్భంగా, వైసిపి లావేరు యువజన విభాగం అథ్యక్షులు బాలి శ్రీనివాస నాయుడు BSN వారిని చిన్న మురపాక లో సన్మానించారు. ఈ కార్యక్రమం లో చిన్న మురపాక MPTC సిరిపురపు రాంబాబు, వైసిపి SC సెల్ రాష్ట్ర కార్యదర్శి పెయ్యల లక్ష్మణరావు, వైసిపి నాయకులు గొర్లె సూర్య ప్రకాష్, చిన్నయ్యపేట నాయకులు మీసాల అప్పలనాయుడు, రెడ్డి గోపాల్, యలకల భాస్కరరావు, పండోడు తదితరులు పాల్గొన్నారు.